Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించిందని విమర్శించారు. సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటని నిలదీశారు.
యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారని హరీశ్రావు గుర్తుచేశారు. SRSP స్టేజ్ -2 లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారని తెలిపారు. ప్రచారం చేసుకున్నారు గానీ, రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే, మన్ముందు సాగు నీరు నీటి సరఫరా ఎలా చేస్తారని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది,
రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చింది.పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిని దుస్థితిని కల్పించింది.
సాగు నీటి శాఖ మంత్రి @UttamINC గారి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి.
యాసంగి… pic.twitter.com/QfQbqcGFpg
— Harish Rao Thanneeru (@BRSHarish) January 20, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహా మంత్రుల మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అని మరోసారి రుజువైందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా ఆచరణకు దిగాలని హితవుపలికారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి, పంట పొలాలకు నీళ్లు అందించాలని సూచించారు. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవాలన్నారు.
మరోవైపు కాళేశ్వరం జలాలతో నిండుకుండలా రంగనాయక సాగర్ ప్రాజెక్టు డ్రోన్ వీడియోను హరీశ్రావు ట్విట్టర్లో పెట్టారు. వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయక సాగర్కు గోదావరి గంగ చేరిందని అన్నారు. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం.. అద్భుత జల సౌందర్యమని పేర్కొన్నారు. కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడాలని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించాలని సూచించారు.’
వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగ.
ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం. అద్భుత జల సౌందర్యం.
కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా.. కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండి.
కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని… https://t.co/xVb4zhzTL5
— Harish Rao Thanneeru (@BRSHarish) January 20, 2025