Harish Rao | ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ నేత హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని సూచించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంతసేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన మాటను హరీశ్రావు గుర్తుచేశారు. వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హేయమైన చర్య అని విమర్శించారు.
ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని @revanth_anumula నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి… pic.twitter.com/JnHA8ZrZZT
— Harish Rao Thanneeru (@BRSHarish) December 25, 2024
నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలన్నారు.