హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కాదని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు. షా బాద్ మండలంలోని ఓ గ్రామంలో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిం దితుడిని 24 గంటలు దాటినా గుర్తించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రజలు సమాధానం అడుగుతుంటే, ముఖ్యమంత్రి మా త్రం మరోసారి కేసీఆర్ పేరును జపి స్తూ బీఆర్ఎస్పై రాజకీయ దాడులకు దిగడం ఆయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రైతులకు సాగునీరు ఇవ్వలేకపోగా రిటైర్డ్ ఇంజినీర్లను వ్యక్తిగతం గా అవమానించడం సీఎం అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.