హైదరాబాద్: అబద్ధాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శించారు. దావోస్లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖడిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్పై రేవంత్ రెడ్డి దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేత మన్నె క్రిశాంక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమతులను రూ.57 వేల కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు తీసుకెళ్లామన్నారు. ఐటీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
లోక్సభలో అదానీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అదే అదానీతో రేవంత్ ఎంవోయూలు కుదుర్చుకున్నారని విమర్శించారు. అదానీతో ఢిల్లీలో కాంగ్రెస్ కుస్తీ.. తెలంగాణలో దోస్తీ అన్నట్లు ప్రస్తుం పరిస్థి ఉందని చెప్పారు. రేవంత్ తెలంగాణను అదానీకి తాకట్టు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోదీని కలిసిన తర్వాతే అదానీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ తొత్తుగా పనిచేస్తున్న అదానీతో రేవంత్ దోస్తీ ఏందని ప్రశ్నించారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేదని రాహుల్ గాంధీ అన్నారని, తెలంగాణలో ఆయన డిఫెన్స్ పరిశ్రమలకు రేవంత్ అనుమతులు ఇస్తున్నారని చెప్పారు. దొంగలు దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా అదానీ, రేవంత్ దోస్తీ ఉందని విమర్శించారు. అదానీ ప్రతిపాదనలను కేసీఆర్ తిరస్కరించారని గుర్తుచేశారు.
గతంలో కేటీఆర్ హయాంలో చేసుకున్న ఒప్పందాలను కూడా ఇప్పుడు చేసుకున్నట్లు చెబుతున్నారని తెలిపారు. పెట్టుబడుల ప్రకటనల్లో కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. అబద్ధానికి, అహంకారానికి నిలువెత్తు రూపం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. లండన్ వెళ్లి తెలంగాణ సీఎం పదవి విలువ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
LIVE | BRS Leaders @sravandasoju and @Krishank_BRS Press Meet at Telangana Bhavan https://t.co/ICuqbOhFNU
— BRS Party (@BRSparty) January 20, 2024