Dasoju Sravan | హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరిపాలన అధికారులను మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల మనసులను మార్చలేరు.. కేసీఆర్ పట్ల ప్రజాభిమానాన్ని తగ్గించలేరు అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ గుండె చప్పుడు అని ఆయన తెలిపారు. ఈ తెలంగాణకు కేసీఆర్ కావాలి.. కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పారు. కేసీఆర్ మూడోసారి తెలంగాణ సీఎం అవుతారని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతో పాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.
IAS (ఐఏఎస్), IPS (ఐపీఎస్), పరిపాలన అధికారులను మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల మనసులను మార్చలేరు. కేసీఆర్ పట్ల ప్రజాభిమానాన్ని తగ్గించలేరు.
తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్.
తెలంగాణకు కేసీఆర్ కావాలి.
కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి కావాలి
కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని…— Prof Dasoju Srravan (@sravandasoju) October 12, 2023