హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కులగణన, స్థానిక రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కుల గణన డెడికేటెడ్ కమిషన్కు నివేదిక అందించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. త్వర లో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ ప్రతినిధుల బృందంతో కలిసి నివేదిక అందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకు విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దకడం లేదని ఆవేదన చెందారు. సమాజంలో అంతరాలను రూపుమాపేందుకు, బలహీనవర్గాలను ఉన్నతస్థితిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం కుల సర్వేను నామమాత్రంగా కాకు ండా పకడ్బందీగా చేసి రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధినిరూపించుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ సందర్భంగా సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కులగణన, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి అధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.
వాటిని జాగృతి క్రోడీకరించి నివేదిక రూపొందించింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెకలతో తెలంగాణ సామాజిక స్వరూపాన్ని ఆవిషరించేలా పకడ్బందీగా నివేదికను సిద్ధంచేశారు. నివేదిక రూపకల్పనలో బీసీ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు సహా ఇతర రంగాల నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఉద్యమ సమయంలో అప్పటి శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించినట్టుగానే తాజాగా డెడికేటెడ్ కమిషన్కు సమగ్ర నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా 17 ఏండ్లుగా అనేక అంశాల్లో జాగృతి కీలకపాత్ర పోషించిన విషయాన్ని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత పోరాడిన తీరును ఈ సమావేశంలో చర్చించారు.