హనుమకొండ, జనవరి 16: ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీం కోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశా రు. ఎస్సీ వర్గీకరణ, దళితబంధు అమలుపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్తో కలిసి మంగళవారం ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణపై బీజేపీ మాటలు నమ్మలేమ ని, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు ప్రారంభించిందని వివరించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేశారని, ఈ ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. రెండో విడతలో కలెక్టర్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు దళితబంధు పథకం కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.