సూర్యాపేట : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు , ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ(BRS)లో చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్(Congress)కు చెందిన సూర్యాపేట జిల్లా(Suryapeta District) తిరుమలగిరి మండలం తొండ గ్రామ సర్పంచ్ నెమరుగొమ్ముల శాతవాహన రావు, ఉప సర్పంచ్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు రామారావు, మాజీ ఎంపీటీసీ రామనుజయ్య తదితరులు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో చేరారు.
వీరితో పాటు వార్డు మెంబర్లు కొమురెల్లి రజిత లింగయ్య, ఉపేంద్ర చంద్రు, జ్యోతి చంద్రయ్య, నరసయ్య, స్వప్నఅనిల్, ఖమ్మంపాటి ఎల్లయ్య, గౌడ సంఘం అధ్యక్షులు కొండ సాయిమల్లు, ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు వేల్పుల ఎల్లయ్య, నాయకులు లోడే సాయి, నీరటి వెంకన్న, మధు, రవి, రాజు, అంజయ్య, సత్తయ్యతో పాటు మరో 500 మంది నాయకులు చేరారు. ఈ సందర్భంగా వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీశ్కుమార్, మాజీ ఎంపీటీసీ దూపటి రవీందర్, గోపాల్ రెడ్డి, మల్లయ్య, రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.