హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర నాయకుడు వేముల మారయ్య తెలిపారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఆటోడ్రైవర్ల సమస్యలపై గొంతెత్తిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కృషిని మరువబోమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 16న జరిగే ఆటో బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లు ఎంతో దైర్యంగా ఉన్నారని, ఇప్పుడు జీవనం కోల్పోయి రోడ్డునపడ్డారని తెలిపారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పోలె నిరంజన్, సెక్రెటరీ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.