CM KCR | బీఆర్ఎస్ది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగ సోదరులకు మనవి చేస్తున్నా. మీరందరూ గత ప్రభుత్వాలను చూశారు. పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీల ప్రదర్శన చేయలేదు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఎలా వెళ్తున్నామో తెలుసు. చిన్న ఉద్యోగులు, కాంటాక్ట్ ఔటర్ సోర్సింగ్ ఉద్యోగుల కడుపులు నింపాలని.. భారత్లోనే తొలిసారిగా పీఆర్సీ ఇస్తే.. దాంతో సమానంగా జీతాలు పెంచింది చూశారు. సింగరేణి ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నమో చూస్తున్నది. ఓటు అనేది తమాషాగా, అలవోకగా వేయకుండా.. వేయకుండా ఈ విషయాలను ఆలోచించి.. చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది’ జరుగుతుందన్నారు.
‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆ నాడు నేను బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు. కేసీఆర్ బక్కగున్నడు.. ఎవరో బొండిగి పిసికి చంపేస్తరు.. ఎక్కడి తెలంగాణ ? యాడ వస్తదని మాట్లాడిండ్రు. నేను ఒక్కడినే అయినా.. నాతో పిడికెడు మందే ఉన్నా.. పక్షి తిరిగినట్టు తెలంగాణ మొత్తం తిరిగి.. సమాజాన్ని జాగృతం చేసి.. ఉప్పెలా తయారు చేస్తే అద్భుతంగా మనం రాష్ట్రం సాధించుకున్నాం. కొత్తగూడెం పట్టణానికి కనీసం రెండు డజన్ల సార్లు వచ్చాం. ఆ నాడు సభలు కూడా పెట్టం. నాతో కలిసి చాలా మంది మిత్రులు పని చేసినవారున్నారు. ఆ ఉప్పెనను చూసి దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే.. ఇది న్యాయమైన విషయమని 34 పార్టీలు మద్దతు తెలిపితే రాష్ట్రం తెచ్చుకోగలిగినాం. తెచ్చిన తెలంగాణను కొత్త సంసారాన్ని ఎలా వెళ్లదీస్తామో అలా.. నడుపుతున్నాం’ అన్నారు.
‘ఉద్యోగులకు సంక్షేమం చేస్తున్నాం. చిన్న ఉద్యోగులను ఆదుకుంటున్నాం. కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. అన్నివర్గాల ప్రజలు ఏకతాటిపై ముందుకు సాగుదాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే.. పాత ఖమ్మం జిల్లా బంగారు తునకలా తయారైతది. కరువు అనేది మనకు రానే రాదు. కొత్తగూడెం జిల్లా గిరిజనులు ఉండే జిల్లా. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. వనమా వెంకటేశ్వర్రావు పెద్ద మనిషి. గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ నుంచి మంత్రి వరకు రాజకీయాల్లో ఎదిగారు. కోరి కోరి ఆయనను తెచ్చుకున్నాం. వనమా వెంకటేశ్వర్రావుకు ఓటు వేయాలి.
మంచి వ్యక్తి, కొత్తగూడెం నియోజకవర్గానికి ఎంతో చేయాలని తపన పడుతుంటారు. నా దగ్గరకు ఎన్నో సార్లు ఆయన వచ్చారు. ఏ సమయంలోనూ వ్యక్తిగత పనులు అడుగలేదు. నియోజకవర్గ పనులు అడిగారు తప్ప వ్యక్తిగతమైన పనులు అడుగలేదు. అలాంటి మంచి వ్యక్తిని కొనసాగితే కొత్తగూడెం చాలా బాగుపడుతుంది. నేను ఎన్నికల తర్వాత ఐదారు సార్లు కొత్తగూడెం వస్తాను. సమీక్ష చేద్దాం.. ఏ పద్ధతుల్లో తీసుకుపోవాలో అలా ముందుకుపోదాం. అందరూ కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్కు ఓటేసి.. నవంబర్ 30 వరకు ఇదే ఉత్సాహం కొనసాగించే వనమా వెంకటేశ్వరరావు భారీ మెజారిటీతో గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.