KCR | జగిత్యాల : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యే తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు(85) ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఎంతోమంది పేదలకు న్యాయ సహాయం అందించారు. ఇక కేసీఆర్ వెంట హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.