KCR | తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పదేండ్ల పాలన స్వర్ణ యుగాన్ని తలపించింది. చంటి బిడ్డ నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ సంక్షేమ ఫలాలు అందుకున్నారు. అన్నం పెట్టే రైతన్న నుంచి మొదలుకుంటే ప్రగతిని పరుగులు పెట్టించే పారిశ్రామికవేత్తల వరకు అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులైనాయి. ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను నట్టేట ముంచారు. సాగుకు నీరివ్వకుండా పంట పొలాలను ఎండబెట్టి, రైతుల ఆత్మహత్యలను కళ్లారా చూస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2014కు పూర్వం ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయనడంలో సందేహం లేనే లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనవసరంగా కాంగ్రెస్ను గెలిపించామని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను యాది చేసుకుంటున్నారు. చేజేతులారా.. కేసీఆర్ను ఓడగొట్టుకున్నామని రైతులు, కార్మికులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఓ పాట అందర్నీ ఆలోచింపజేస్తుంది. కేసీఆర్ బాపును వదులుకున్నాం.. కరువును కళ్లారా చూస్తున్నాం.. అనే పాట అందరి హృదయాలను కదిలిస్తోంది. మరి ఆ పాటను మీరు కూడా ఒకసారి వినండి..
🎵🎶పోరాటమన్నది కొత్తకాదే ఓ తల్లి లచ్చుమమ్మ..
🎵🎶బాపు ఆరాట పడకుంటె రాష్ట్రమేదే నా తల్లి లచ్చుమమ్మ!🎵🎶గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చుమమ్మ..
🎵🎶వెనుకడుగు వేయక ముందరుంటా నా తల్లీ లచ్చుమమ్మ!తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/ULyPDLLP77
— BRS Party (@BRSparty) April 15, 2024