KCR | హైదరాబాద్ : బంజారాహిల్స్ నంది నగర్ నివాసంలో కేసీఆర్ చేవెళ్ల లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.
చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. pic.twitter.com/YyMSPSTk6q
— BRS Party (@BRSparty) March 11, 2024