KCR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నల్లగొండ సభకు బయల్దేరారు. మరికాసేపట్లో సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో 300 మంది కూర్చునేలా విశాలమైన వేదికను నిర్మించారు. వేదికకు ఎదురుగా వీఐపీ, మీడియా గ్యాలరీలను నిర్మించారు. వాటి వెనుక ప్రజలు కూర్చునేలా ప్రత్యేకంగా పలు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.
కృష్ణానదీ జలాల్లో న్యాయమైన వాటా కోసం గొంతెత్తి నినదించిన ఏకైక తెలంగాణ నాయకుడు కేసీఆరే. తెలంగాణ ఉద్యమంలో భాగంగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలో జలసాధన యాత్రలు నిర్వహించి ప్రజలను జాగృతం చేసిన చరిత్ర మన కండ్లెదుటే ఉన్నది. నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు కృష్ణా జలాల్లో తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టిన విషయం తెలిసిందే.