KCR | సంగారెడ్డి : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్కర్కు నివాళులర్పించలేదు అని ధ్వజమెత్తారు. సుల్తాన్పూర్లో ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నేడు రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి, రాష్ట్రం సాధించే పోరాట పటిమ అందించి పెంచింది ఈ మెతుకుసీమ. మీరు ఇచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. మీ దీవెనలు, ఆశీర్వచనాలు లేకపోతే, ఈ మెతుకు గడ్డ రక్తం, నీళ్లు నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజార్టీ ఇచ్చి హరీశ్రావు నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు స్థానాలు గెలిపించిన మీకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎన్ని జనమ్మెలెత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేను. తెలివి ఉన్నవాడు, అడ్డం పొడవు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంట్ ఓట్లు సీట్లు ఎందుకు అని అంటున్నారు. ఇప్పుడే కావాలి ఓట్లు సీట్లు. ఎందుకంటే ఆనాడు మీరు ఆశీర్వదించకపోతే కరీనంరగ్ ఎంపీగా గెలవకపోతే పార్లమెంట్లో తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే తెలంగాణ ఎలా వచ్చేది. ఇవాళ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్లో మన బిడ్డలు ఉండాలి. అప్పుడే అన్ని నెరవేరుతాయి అని కేసీఆర్ తెలిపారు.
పాలిచ్చే బర్రెను ఎత్తేసి దున్నపోతును తెచ్చుకున్నామని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అప్పుడప్పుడు రాజకీయాల్లో గమ్మత్తుగా గుడ్డి లక్ష్మీవచ్చినట్టు కొంతమంది లిల్లీఫుట్గాళ్లకు అధికారం వస్తది. సేవ చేయమని రాష్ట్రాన్ని బాగా చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పని చేయమని చెప్పరు. నిన్న స్వయంగా కండ్లారా మీరు చూశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, అబేద్కర్ పుణ్యమా అని రాష్ట్రం వచ్చింది. ఆ మహానీయుడిని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 పీట్ల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకున్నాం. పోయిన ఏడాది మీరంతా వచ్చారు. బ్రహ్మాండంగా ఆవిష్కరణ చేసుకున్నాం. విగ్రహం పెట్టిన తర్వాత నిన్న తొలి జయంతి జరిగింది. ఈ లిల్లిఫుట్గాళ్ల ప్రభుత్వం ఏం జేసింది అంటే అక్కడికి గవర్నమెంట్ పోలే. హిమాలయ పర్వతమంతా ఉన్న విగ్రహానికి పువ్వు పెట్టలేదు. అంజలి ఘటించలేదు. అనేక రాష్ట్రాల ప్రజలు వచ్చారు. కనీసం వారికి మంచినీళ్లు ఏర్పాటు చేయలేదు. గేట్లు బంద్ చేసి తాళాలు వేశారు. దీన్ని కండకావరం, అజ్ఞానం, అహంకరాం అనుకోవాలా..? ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా..? ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. మరి సెక్రటేరియట్లో సిగ్గులేకుండా కూర్చుంటున్నారు.. అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉంది కదా..? యాదగిరిగుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టింది.. అక్కడ ఎందుకు మొక్కుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ను కూడా కట్టింది బీఆర్ఎస్ గవర్నమెంటే. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంట్ల ఎందుకు ఉంటున్నారు. మిషన్ కాకతీయ చెరువులను కూడా బంద్ చేస్తారా.. అందుకే వీరిని లిల్లిఫుట్ గాళ్లు అని అన్నానని కేసీఆర్ తెలిపారు.