BRS – BSP | హైదరాబాద్ : త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడితో కేసీఆర్ నిర్ణయించారు.
బంజారాహిల్స్లోని నంది నగర్ నివాసంలో కేసీఆర్ను ప్రవీణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా పొత్తుపై చర్చించారు. ఈ సమావేశంలో హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.