జగిత్యాల : బీఆర్ఎస్(BRS) శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తూ రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలను సమయత్తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) తెలిపారు. ఆదివారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ధర్మపురి మండల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం (Telangana government)ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడకు అందుతున్న విషయాలపై, జరుగుతున్న అభివృద్ధిపై చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ సమ్మేళనాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించే విషయంలో జవాబు దారిగా ఉండాలని అన్నారు. ఉద్యమ పార్టీకి ప్రజలు రెండు సార్లు అధికారం అప్పగించారని మూడోసారి కూడా విజయమే లక్ష్యంగా శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో వివరించాలన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి , పోలీస్ హోసింగ్ కమిటీ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్ ఇందాపు రామన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు సౌళ్ల భీమన్న, వైస్ ఎంపీపీ మహిపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేశ్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు కైసర్ తదితరులు పాల్గొన్నారు.