హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10వరకు తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని సీఈవో వికాస్రాజ్ను బీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కే వాసుదేవరెడ్డి శుక్రవారం వికాస్రాజ్కు వినతిపత్రం అంద జేశారు.
యాత్రలో పోలీసులు భద్రతా చర్య లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని.. సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్పై దాడులు చేస్తూ, బీఆర్ఎస్ ఫ్లెక్సీలను, బ్యానర్స్ను తొలగిస్తున్నదని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ చేవెళ్ల సభ, మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన సభల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించారని ఫిర్యాదుచేశారు.