హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు రాష్ర్టాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే శక్తియుక్తులు, మతతత్వ బీజేపీని అడ్డుకునే సత్తా సీఎ కేసీఆర్కే ఉన్నాయని చెప్పారు.
గురువారం ఆయన ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలుగువారికి సగర్వ వేదికగా బీఆర్ఎస్ భవన్ నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ మాడల్ను దేశమంతా విస్తరించాలని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. దేశంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు.