పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్(Putta Madhukar) పై అవిశ్వాసం పెట్టే ప్రయత్నాలకు చెక్ పడింది. విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ణు రంగంలోకి దింపగా గురువారం మాజీ మంత్రి తన నివాసంలో అందుబాటులో ఉన్న జెడ్పీటీసీలను పిలిచి మాట్లాడారు.
జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో పాటు ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, ధర్మారం జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ జితేందర్ రావు, మంథని జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్, అంతర్గామ్ జెడ్పీటీసీ ఆముల నారాయణ హాజరయ్యారు. తమకు అవిశ్వాసం పెట్టే ఆలోచన లేదని, పార్టీ పేరు చెప్పి తమను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు తెలిపారు. మిగతా జెడ్పీటీసీ లను మంత్రి ఫోన్లో సంప్రదించారు.