హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకోవడం అవసరమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, త్వరలో అవసరమైనన్ని డోసులు పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బూస్టర్ డోస్ వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా నిలువడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో ఉందన్నారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుంది. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులు ప్రికాషనరీ టీకాలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా మంత్రి కోరారు.
బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలవడం సంతోషం. సీఎం కేసీఆర్ గారి ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉంది. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుంది 1/2 pic.twitter.com/kTv9OIoCdV
— Harish Rao Thanneeru (@trsharish) December 24, 2022