పుదుచ్చేరి: అందరికీ ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్ వేయడంతోపాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయడంతోపాటు ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్లో చేర్చుతామనీ హామీ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఈ మేనిఫెస్టోరీని రిలీజ్ చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే అందరికీ ఫ్రీగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామనీ స్పష్టం చేసింది. తమ ప్రధాన హామీలను మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ప్రస్తావించామని ఈ సందర్భంగా నారాయణ స్వామి చెప్పారు.
ఈ హామీల్లో ఫ్రీగా కొవిడ్ వ్యాక్సిన్, పుదుచ్చేరికి రాష్ట్ర హోదాతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మత్య్సకారుల పిల్లలకు ప్రైమరీ నుంచి రీసెర్చ్ స్థాయి వరకూ ఉచిత విద్య అందిస్తామనీ చెప్పింది. ఉన్నత తరగతులు, కాలేజీ విద్యార్థులకు 60 జీబీ డేటా ఉచితంగా ఇస్తామనీ స్పష్టం చేసింది. ఉచిత ల్యాప్టాప్లనూ అందజేస్తామని చెప్పింది. పుదుచ్చేరి ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. బీజేపీ, అన్నా డీఎంకే, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఏప్రిల్ 6న ఒకే దశలో పుదుచ్చేరికి ఎన్నికలు జరగనున్నాయి.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
బెంగాల్లోని ఆ 30 సీట్లలో 26 బీజేపీవే: అమిత్ షా
కూటమి కొట్లాట.. అనిల్ ఓ యాక్సిడెంటల్ హోమ్ మినిస్టర్ అన్న శివసేన