జగిత్యాల : జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్రెడ్డి పేర్కొన్నారు. మల్లేశంకు పది రోజుల క్రితం కరోనా సోకగా.. హోం ఐసొలేషన్లోనే ఉండి చికిత్స తీసుకోవడంతో తగ్గిపోయిందని తెలిపారు. కరోనా తగ్గాక రెండు రోజుల నుంచి తల ప్పి, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా సోమవారం కరీంనగర్లోని ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు.
మల్లేశంకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని సర్పంచ్ వివరించారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్కు వివరించడంతో రాజేశంను అంబులెన్స్లో హైదరాబాద్ గాంధీ దవాఖానకు పంపించినట్లు సర్పంచ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి