క్షీరాభిషేకం చేస్తున్న టీఆర్ఎస్పై కవ్వింపు చర్యలు
పాలకుర్తిలో బాహాబాహీకి దిగిన బీజేపీ కార్యకర్తలు
పాలకుర్తి రూరల్, మార్చి 9 : జనగామ జిల్లాలో బీజేపీ నాయకులు రెచ్చిపోయారు. ఉద్యోగాల భర్తీపై బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయగానే సంబురాలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలకుర్తిలోని రాజీవ్చౌరస్తాకు చేరుకొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న సమయంలో బీజేపీ నాయకుడు కర్ర శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా టీఆర్ఎస్ నాయకులు సంయమనం పాటించగా, బీజేపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోవడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో సీఐ చేరాలు, ఎస్సై వంశీకృష్ణ వారిని శాంతింపజేశారు. బీజేపీ నాయకులను పోలీస్స్టేషన్కు తరలించారు.