హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ చిల్లర వేషాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమనేత, అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు అనుచిత, అసభ్యకర, అభ్యంతరకరమైన సిట్స్ వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కించపరిచే నాటకాలు వేసినవారిపై, అలా వేసేందుకు ఉసిగొలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు ప్రేమేందర్రెడ్డి, జిట్టా బాలకిషన్రెడ్డి, రాణిరుద్రమపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తమ్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
సీఎం కేసీఆర్పై బీజేపీ నేతలు వేసిన అనుచిత స్కిట్పై తాము స్పందించాలనుకుంటే ప్రధాని మోదీ భార్యను వదిలేశారనో.. ఇంకొకటో అనొచ్చునని, అయితే ఆ స్థాయికి తాము దిగజారదల్చుకోలేదని చెప్పారు. సీఎం హోదాకు, వయసుకు విలువ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని, చీరి చింతకు కడతారని సతీశ్రెడ్డి హెచ్చరించారు.