హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): గొల్ల, కురుమలకు బీజేపీ ధోకా చేసింది. వారి నోటికాడి ముద్దను లాగేసుకొన్నది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని అడ్డుకొన్నది. గొల్ల, కురుమల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన బీజేపీ.. రాజకీయ లబ్ధే ప్రధాన లక్ష్యంగా గొర్రెల పంపిణీని నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ తాన అంటే తందాన అంటున్న కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫిర్యాదు అందడమే ఆలస్యమన్నట్టుగా మునుగోడులో గొర్రెల పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో గొల్ల, కురుమల నోట్లో బీజేపీ మట్టి కొట్టినైట్లెంది.
వాస్తవానికి ఈ పథకం కొత్తదేమీ కాదు. కొన్నేండ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమ లు చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడతలో సుమారు 4 లక్షల మంది అర్హులకు గొర్రె పిల్లలను పంపిణీ చేసింది. తా జాగా రెండో దశ పంపిణీ కొనసాగుతున్నది. ఇందు లో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని లబ్ధిదారులకు గొర్రె పిల్లలను పంపిణీ చేయాలని పశుసంవర్ధకశాఖ నిర్ణయించింది. గొర్రెలకు బదులుగా నగదును నేరుగా లబ్ధిదారులకు అందించాలని భావించింది. నల్లగొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో మునుగోడు నియోజకవర్గం కూడా ఒక భాగంగా ఉన్నది.
మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది అర్హులకు 25% సబ్సిడీ పోనూ ఒక్కొక్కరికీ రూ.1,31,250 చొప్పున నగదును బదిలీ చేసింది. ఇది కొనసాగుతున్న సమయంలోనే టీఆర్ఎస్కు ఎక్కడ రాజకీయ లబ్ధి జరుగుతుందోననే ఆలోచనతో ఈ ప్రక్రియను నిలుపుదల చేయించేలా బీజేపీ కుట్రలు పన్నింది. గొర్రెల పంపిణీని, నగదు బదిలీని నిలిపివేయాలని సీఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం పథకాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేసింది.కలెక్టర్ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ యంత్రాం గం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన నిధులు నిలిపివేయాలని బ్యాంకర్లకు సూచించడంతో బ్యాంకుల అధికారులు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నవంబర్ 6వరకు ఈ నిధులు ఫ్రీజ్ అయి ఉంటాయి.
గొర్రెల పంపిణీ నిలిపివేతకు కారణమైన బీజేపీపై గొల్ల, కురుమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కు అందివచ్చిన లబ్ధిని దూరం చేశారని మండిపడుతున్నారు. మీరెలాగూ మాకు మంచి చేయరు.. కనీ సం చేసే వాళ్లనైనా చేయనివ్వరా అని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ కలిగించిన నష్టానికి కచ్చితంగా బదులు తీర్చుకొంటామని హెచ్చరిస్తున్నారు.
గొర్రెల పంపిణీని అడ్డుకొని గొల్ల కురుమలకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. ఇలాంటి పార్టీ నాయకులను గ్రామాలకు రానివ్వకుండా అడ్డుకొని తరిమి కొట్టాలి. సీఎం కేసీఆర్ గొల్ల కురుమలను ఆదుకోవాలని చూస్తే.. బీజేపీ మాత్రం వారికి నష్టం చేయాలని చూస్తున్నది. తమకు అన్యాయం చేసిన బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి.
– దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్,గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్