కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సొంత ఇలాకాలో ఘోర పరాభవం ఎదురైంది. ప్రజాసంగ్రామ యాత్ర దారిపొడవు నా ప్రశ్నల వర్షం గుప్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తు లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర పేరిట భైంసా నుంచి పాదయాత్ర చేస్తున్న బండి.. మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మంగపేట వద్ద సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టారు. రాత్రి ఇక్కడే బస చేసిన సంజయ్ బుధవారం ఉదయం పాదయాత్ర కొనసాగించారు. మంగపేటలో కార్యకర్త లు పలుచగా కనిపించగా.. నారాయణపూర్, ఇస్తారిపల్లి నుంచి అప్పటికప్పుడు స్థానిక నాయకులు జనాలను తరలించారు. అక్కడి నుంచి పాదయాత్రగా గంగాధర ఎక్స్రోడ్ వరకు వచ్చిన జనం వెన క్కి వెళ్లడంతో పాదయాత్ర వెలవెలబోయింది.
రామడుగు మండలం మీదుగా కరీంనగర్ చేరుకుంటున్న బండికి వ్యతిరేకంగా దారిపొడవునా నిరసన తెలుపుతూ ఫ్ల్లెక్సీలు వెలిచాయి. రామడు గు మండలం వెదిర క్రాస్ రోడ్డులోని రాజాజీనగర్, దేశరాజ్పల్లి గ్రామాల్లో అజ్ఞాత వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బండి సంజయ్కి సూటి ప్రశ్నలు సంధించారు. సొంత ఇలాకాలో కూడా నిరసన ఫ్లెక్సీలు వెలువడం చర్చకు దారితీస్తున్నది. స్థానికులతోపాటు కరీంనగర్, జగిత్యాల రహదారి వెంట వెళ్లే వారు ఈ ఫ్లెక్సీలపై చర్చించుకోవడం కనిపించింది. గురువారం మధ్యాహ్నం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ దఫా పాద యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. నడ్డా హాజరయ్యే ఈ సభకు జనాన్ని ఏ విధంగా తరలించాలి? అనే విషయమై బీజేపీ సీనియర్ నాయకులు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తున్నది.