విద్యానగర్ (కరీంనగర్), జనవరి 2: పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ కష్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం కరీంనగర్లో జరిగిన బీజేపీ మండల అధ్యక్షులు, కొత్తగా ఎంపికైన మండల ఇన్చార్జీల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు.