హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మద్దతు తెలిపారు.
ఈ మేరకు చేనేత విభాగం ప్రధాని నరేంద్రమోదీకి రాసిన ‘మహా వస్త్ర లేఖ’పై ఆయన సంతకం చేశారు. జీరో జీఎస్టీ ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్నతోపాటు పలువురు నేతలు వివిధ పార్టీల నాయకులను, ప్రముఖులను ప్రత్యేకంగా కలుస్తున్నారు. అందులో భాగంగా గురువారం బెంగళూరులో రామమూర్తిని కలిసి మద్దతు కోరారు.