నిజామాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ఇందల్వాయి మండలంమల్లాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి బాజిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్లో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, సీనియర్ నాయకులు కృష్ణ, మల్లాపూర్ సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాము, ఎంపీటీసీ సరిత, సంపల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి, పులి సాగర్ తదితరులు పాల్గొన్నారు.