BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఇదే వాట్సాప్ యూనివర్సిటీ తెలివి అంటూ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు మరోసారి తమ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్కు నివాళులర్పిస్తూ ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో బండ బూతులు రాశారు సంజయ్. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎలాంటి భాష ఉపయోగించాలి, ఎలాంటి పదాలు రాయాలో కూడా తెలియదా? అని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
అంబేద్కర్ విగ్రహానికి బదులుగా స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు కసిరెడ్డి సింధూ రెడ్డిపై కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం తెలివి అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా ఎలా పోస్టులు చేస్తారని ఎద్దెవా చేస్తున్నారు.
బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి కూడా అంబేద్కర్ను కించపరిచేలా రాతలు రాశారు. సామరస్యానికి బదులుగా సమరసత అని బండ బూతులు రాసి ట్వీట్ చేశారు. బీజేపీ నేతల ట్వీట్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస జ్ఞానం లేకుండా రాజకీయ నాయకులు ఎలా అయ్యారని ప్రశ్నిస్తున్నారు. మహానీయుడు అంబేద్కర్ గురించి తెలియని వారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఈ ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే కసిరెడ్డి సింధూ రడ్డి ట్వీట్ను తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. ఫేక్ డిగ్రీ పార్టీలో ఉంటే ఇలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించి, అంబేద్కర్ విగ్రహానికి అంటూ ట్వీట్ చేయడం వారి తెలివితక్కువ తనానికి నిదర్శమని పేర్కొన్నారు.
What are the side effects of being in a ‘Fake Degree’ Party? 👇
Wishing #Ambedkar ji with a picture of swamy #Vivekananda pic.twitter.com/oEigRnO8i1
— YSR (@ysathishreddy) April 14, 2023