హనుమకొండ : అబబ్ధాల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని కలలుకంటోందని, వారి కలలు కల్లలేనని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండి మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించలేని దద్దమ్మలు బీజేపీ నేతలపై మండిపడ్డారు.
ఎంతో ప్రసిద్ధి గాంచిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కడియం డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా బీజేపీపై పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ..దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా దళితుల, ఆదివాసుల, గిరిజనుల, మైనారిటీల ఆగ్రహానికి గురవుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు. విషయపరిజ్ణానం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి విమర్శించారు.