కరీంనగర్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తయ్యాయి. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1269 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్లో ఈటలకు 911 ఓట్లు అధికంగా పోలయ్యాయి.
మూడో రౌండ్లో ఈటల రాజేందర్ 4064, గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 3153, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్కు 107 ఓట్లు పోలయ్యాయి. రోటీ మేకర్ గుర్తుకు 43 ఓట్లు, వజ్రం గుర్తుకు 22 ఓట్లు పోలయ్యాయి.