బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు ఒకవైపు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే మరోవైపు కేంద్రం రాష్ట్రానికి సహకరించకపోగా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నదని అన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. తెలంగాణ రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేసినా కేంద్రంలోని బీజేపీ సరారులో చలనం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలతోనైనా దిగివస్తుందని భావించామని, కానీ, వారు చలించడంలేదని విమర్శించారు.
ఈ ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, వీ శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు బీబీ పాటిల్, పసునూరి దయాకర్, రంజిత్రెడ్డి, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, నామా నాగేశ్వరరావు, పీ రాములు, వెంకటేశ్ నేతగాని, కే కేశవరావు, కే ఆర్ సురేశ్రెడ్డి, జే సంతోష్కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, రైతుబంధు సమితి జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
సైడ్లైట్స్
ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్లోని ధర్నా ప్రాంగణానికి చేరుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. మహత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ధర్నా వేదికను శాసనసభ్యులు దానం నాగేందర్, గోపీనాథ్ ఏర్పాటుచేశారు.