మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. దీనికి నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినదించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగ్గా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, డైరెక్టర్లు, విద్యార్థులు, యువకులు, గిరిజన నాయకులు పాల్గొన్నారు.