హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల (Assembly Elections) నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులను ప్రకటించింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం పార్టీ ఎంపీలుగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay), ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అర్వింద్, బోథ్ నుంచి సోయం బాపూరావులకు టికెట్లు కేటాయించింది. ఇన్నాళ్లూ సస్పెన్షన్ ఎదుర్కొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్కు తిరిగి ఆయన స్థానం నుంచే బరిలోకి దిగనున్నారు. ఆయనపై పార్టీ అధిష్ఠానం ఆదివారం ఉదయం సస్పెన్షన్ ఎత్తివేసిన విషయం తెలిసిందే.