హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో బీజేపీకి షాక్ తగిలింది. పంగిడిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మందికి పైగా బీజేపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంఛార్జి పేరియాల రవీందర్ రావు సమక్షంలో వీరు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఆలేటి రాజు, తిప్పారపు శ్రీకాంత్, తరిగొప్పుల అనిల్, ఎండి రహీం, ఎండి రియాజ్, ఎస్ ఓంకార్, తిప్పారపు ప్రశాంత్, మండ వెంకటేష్, ఎం సుజాత, ఏ మమత, ఎండి రజియా బేగం, ఎం నర్సక్క, ఎం సునీతతో పాటు తదితరులు ఉన్నారు.