హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వం నుంచి భూములు లీజుకు పొందిన పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్రెడ్డి బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘రేవంతూ.. అంటే నా వంతు’ అని అడుగుతున్నారని ఆరోపించారు. ఈ విధంగా సేకరించిన డబ్బును ఢిల్లీకి పంపిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అనేక ఘటనలకు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వరుసగా ఒక్కోదానిని బయటపెడుతామని పేర్కొన్నారు.