జగిత్యాల, అక్టోబర్ 12: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో కాంగ్రెస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం పలు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన వారిని ప్రజలు నిలదీశారు. ‘అధికారంలో ఉన్నప్పుడు మా కోసం ఏమైనా చేశారా? ఒక్క పథకంలోనైనా లబ్ధి కలిగించారా? ఓట్లప్పుడే మేం కనిపిస్తాం.. మా కాలనీలు మీకు గుర్తుకొస్తాయి.
ఇంకోసారి ఇటువైపు రాకండి’ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మిని మహిళలు నిలదీశారు. దీంతో ప్రచారం చేయకుండానే నాయకులు వెనుదిరిగారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మరదలు అయిన విజయలక్ష్మికి సొంత వార్డులోనే చేదు అనుభవం ఎదురుకావడం, ప్రజలు ఎకడికకడ నిలదీయడంతో ‘ప్రచారం చేసేదెలా?’ అంటూ కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకోవడం కనిపించింది.