ఎంపీ ప్రకాశ్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, సైదిరెడ్డి, సురేందర్
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 4 : టీఆర్ఎస్తోనే సాగర్ అభివృద్ధి సాధ్యమని ఎంపీ బండా ప్రకాశ్, దేవరకొండ, హుజూర్నగర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి, జాజాల సురేందర్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని తెట్టెకుంట, తిరుమలగిరి, రంగుండ్ల, రాజవరం, నెల్లికల్, చెంచోనితండా, చింతలపాలెం, గాత్తండా గ్రామాల్లో పర్యటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి, నోముల నర్సింహయ్య తనయుడు భగత్కుమార్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చెంచోనితండాలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పర్యటించారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. తండాల్లో మిషన్ భగీరథ ద్వారా తాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు. రాజవరంలో ఆసరా పింఛన్దారులతో ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా పింఛన్లు అందిస్తున్నదని తెలిపారు. నెల్లికల్లో మత్స్యకారుల సంఘం సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ మత్స్యకారుల సొసైటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తెట్టెకుంటలో గడపగడపకూ ఎమ్మెల్యే సైదిరెడ్డి తిరిగి భగత్ను గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మత్స్యకారుల సంఘం జిల్లా చైర్మన్ పిడిగం నాగయ్య, నోముల భగత్ సతీమణి భవాని, సొసైటీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్రెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.