హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సరఫరాకు సంబంధించి తెలంగాణలో నిరుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక స్పష్టం చేసింది. విద్యుత్తు సరఫరాకు సంబంధించిన గొడవలు అత్యధికంగా బీహార్లో నమోదైనట్టు తెలిపింది. ‘ఎలక్ట్రిసిటీ పవర్ సప్లయ్ డిస్పూట్స్’ విభాగంలో నిరుడు మొత్తం 9 కేసులు నమోదయ్యాయని, వాటిలో 5 బీహార్లో, 2 మధ్యప్రదేశ్లో, 1 ఛత్తీస్గఢ్లో, 1 మహారాష్ట్రలో నమోదయ్యాయని వివరించింది. నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని, నిరంతరం కరెంటు సరఫరా చేయాలని బీహార్లో ప్రజలు అధికారులతో గొడవలకు దిగడంతో ఆ రాష్ట్రంలో నిరుడు అత్యధికంగా 532 కేసులు నమోదైనట్టు వెల్లడించింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003కు సంబంధించి 2022లో దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో నమోదైన మొత్తం 2,82,705 కేసుల్లో ఉత్తరప్రదేశ్ (1,38,853), హర్యానా (83,963), బీహార్ (29,416) తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు వెల్లడించింది. తెలంగాణలో 8 కేసులు మాత్రమే నమోదైనట్టు తెలిపింది.
చోరీల్లో మహారాష్ట్ర టాప్
దొంగతనాల్లో మహారాష్ట్ర దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఆ రాష్ట్రంలో నిరుడు ఏకంగా 94,270 చోరీ కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్థాన్ ఉన్నట్టు వివరించింది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద కేరళలో అత్యధికంగా 26,619 కేసులు నమోదైనట్టు తెలిపింది. ఈ విభాగంలో కేరళ తర్వాత మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉన్నట్టు వివరించింది. ఈ తరహా కేసులు తెలంగాణలో 1,279 మాత్రమే నమోదైనట్టు పేర్కొన్నది.
2022లో ప్రభుత్వ అధికారులపై దాడులు
ఎన్సీఆర్బీ లెక్కలు ఇవీ.. రాష్ట్రం కేసులు
దొంగతనాలు అధికంగా జరిగిన రాష్ర్టాలు
ఎన్డీపీఎస్ కేసులు అధికంగా నమోదైన రాష్ర్టాలు