భిక్కనూరు, జూన్ 6: నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ ప్రమాదం నుంచి బయట పడ్డారు. శనివారం ఆయన తన కుటుంబంతో కారులో హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంగా బిగాల గణేశ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకెక్కి సుమారు 50 మీటర్ల వరకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నప్పటికీ, అందులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.