హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటలు, వేసవి ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. 19వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ను సమర్ధవంతంగా తట్టుకునే నెట్వర్క్ సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యుత్తు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీలో అధికారులతో సమీక్షించారు.
నిరుడు 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, ఈ నెల 13న 18,228 మెగావాట్ల పీక్ డిమాండ్, 341.08 మి లియన్ యూనిట్ల వినియోగంతో సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొన్నా రు. సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, జీతేశ్ తదితరులు పాల్గొన్నారు.