Hyderabad | ఐటీ అంటేనే బెంగళూరు.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్. ప్రపంచంలో పేరొందిన ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి. తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్నాయి. అంతేకాదు.. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ఖర్చు కూడా తక్కువే. దీంతో ఐటీ ఉద్యోగుల తాకిడి హైదరాబాద్కు ఎక్కువైంది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఇక్కడే స్థిరపడేందుకు చాలా మంది ఐటీ నిపుణులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఓ ఐటీ ఉద్యోగి ట్వీటే నిదర్శనం.
పృథ్వీ రెడ్డి అనే ఓ ఐటీ ఉద్యోగి ఏం చెప్పారంటే.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు మకాం మార్చాను. దీంతో నెలకు రూ. 40 వేలు ఆదా అవుతున్నాయి. నేను ఆదా చేస్తున్న డబ్బుతో ఒక కుటుంబం.. నెల రోజుల పాటు ప్రశాంతంగా జీవించొచ్చు. నేను ఇక్కడ ఒంటరిగా జీవించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని పేర్కొన్నారు.
బెంగళూరు కంటే హైదరాబాద్ నగరం అన్నింటికి అనుకూలంగా ఉంది. బెంగళూరు నగరంతో పోల్చితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కూడా తక్కువే. తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారం లభిస్తుంది. ఇండ్ల కిరాయిలు కూడా తక్కువే. రద్దీ లేని సమయాల్లో క్యాబ్లు, ఆటోల్లో తక్కువ ధరకే ప్రయాణించొచ్చు. ఇతర రాష్ట్రాల మాదిరిగా.. తెలుగులోనే మాట్లాడాలని అడగము. ఇక్కడ అందరూ సమానమే.. ఇంగ్లీష్, హిందీ కూడా మాట్లాడొచ్చు. మీరు ఒక వేళ నార్త్ ఇండియన్ అయితే.. కచ్చితంగా బెంగళూరు కంటే హైదరాబాద్ నగరాన్నే ఇష్టపడుతారు అని తన ట్వీట్లో పృథ్వీ రెడ్డి పేర్కొన్నారు.
Moved from Bangalore to #Hyderabad
Saved 40k per month expenses.
One family can live peacefully with that money. 💰
Not seeing any a point of living alone when my values match with my family’s.
— Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023