స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టే ఘోరాలు చేయబోతున్నరు. అన్నదాతల్లారా.. తస్మాత్ జాగ్రత్త! వంచనను గ్రహించి ఆందోళన చేయాల్సిన తరుణమిది! ఇప్పుడు మేలోకపోతే భరోసా ఉండదు.. గోసనే మిగులుతది.
సర్కార్ తీరు చూస్తుంటే అర్థంలేని కొర్రీలు, కోతలతో అరకొరగా అమలుచేసి.. రైతు భరోసా ఇచ్చేసినమని చెప్పి చేతులు దులుపుకోవాలని కుట్ర చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. కొత్తగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అనే రాగం ఎందుకు అందుకున్నరు? ఇప్పుడు వేసేది వానకాలం పైసలా? యాసంగివా? ఒక్క పంటకే ఇస్తరా? రెండింటికిస్తరా? ఈ కుట్రను గుర్తించాలి.
– రైతులకు రాసిన లేఖలో కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా ఎగవేతకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ మోసాన్ని ఎండగట్టాలని రైతులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంక్షలు, కోతల పేరుతో రైతుభరోసాకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ వేస్తున్న ఎత్తులను చిత్తుచేయాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే రేవంత్రెడ్డి ఒక్క పంటకూ ఇస్తలేడని నిప్పులు చెరిగారు. రైతు ప్రయోజనాలకు ఘోరీ కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై ఊరూరా చర్చపెట్టాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన తెలంగాణ రైతాంగానికి బహిరంగలేఖ రాశారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఫ్రభుత్వం రైతుభరోసా విషయంలో స్పష్టత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు సంగతిని అతితెలివిగా పక్కదారి పట్టించారని విమర్శించారు. రైతులు అప్రమత్తంగా ఉండి గ్రామ గ్రామాన కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగట్టాలని కోరారు.
అటెన్షన్ డైవర్షన్ జిమ్మిక్కులు
‘శాసనసభలో రైతు భరోసా విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఎటూ తేల్చలేదు. పైగా సంబంధంలేని అంశాలను చర్చకు తెచ్చి అతి తెలివితో పకదారి పట్టించాడు. బాగా అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మికులు ప్రదర్శించాడు! కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను సగానికి సగం ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్టు అర్థమవుతున్నది. తిండిపెట్టే రైతుకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం ప్రారంభమైంది! విధివిధానాలు, మార్గదర్శకాలు ఏమీ సభలో చెప్పకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తం అని ఒక్క మాట చెప్పి తప్పించుకున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతన్న ప్రయోజనాలకు ఘోరీ
‘రైతుబంధుకు బొందపెట్టి పనికిమాలిన షరతులు విధించి అరకొరగా రైతుభరోసా అమలు చేసి మిమ్ముల్ని నిండాముంచే పెద్ద దోఖా జరగబోతున్నది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. మోసపోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భమిది. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి పెట్టుబడి సాయానికి పూర్తిగా ఘోరీ కట్టే ఘోరాలు చేయబోతున్నరు. వంచనను గ్రహించి ఆంక్షలు వద్దని ఆందోళన చేయాల్సిన వేళ ఇది ! ఇప్పుడు మేలోకపోతే భరోసా ఉండదు.. గోస మాత్రమే మిగులుతది. ఉమ్మడి రాష్ట్రంలో సాగుసంక్షోభంలో మునిగి వెన్ను విరిగిన తెలంగాణ అన్నదాతను ఆదుకోడానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయంలో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టింది. ఆగమైన ఎవుసం బాగుపడ్డది. రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వ్యవసాయాన్ని పండుగలా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. రైతు ఎవరి ముందూ పెట్టుబడి కోసం చేయిచాచే దుస్థితి లేకుండా వానకాలం, యాసంగి రెండు పంటలకు అవసరమైన పైసలు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడే అపురూపమైన ఆలోచన ఆచరణే రైతుబంధు’అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.
హక్కుగా దక్కాల్సినదాన్ని వదులుకోవద్దు
‘కుప్పకూలిన వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో ప్రతి రైతుకూ పెట్టుబడి పైసలు ఇవ్వాలని నిర్ణయించిం. మొత్తం 11 సీజన్లలో రూ. 73 వేల కోట్లను కర్షకుల ఖాతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసింది. అవినీతికి, లీకేజీలకు తావులేని అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతుబంధు. దీన్ని యావత్ ప్రపంచం మెచ్చింది. దేశంలో అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నయి. మరో రూ.28 వేల కోట్లు రుణమాఫీ కింద నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో పడ్డయి. ఈ రెండు సీమ్ల ద్వారానే అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు అన్నదాతల ఖాతాల్లో డైరెక్ట్గా జమైనయి. దుకిదున్నేవాడి దుఃఖం తీర్చాలన్న లక్ష్యంలో రైతన్న మీద ప్రేమతో ఈ బృహత్ కార్యక్రమాన్ని అమలు చేసినం. ప్రతిపైసాను సద్వినియోగం చేసుకొని పుట్లకొద్దీ పంటలు పండించి లక్షలకోట్ల సంపద సృష్టించినం.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయినా అధికారంలోకి రావాలని అన్ని వర్గాలతోపాటు రైతాంగానికి కూడా కాంగ్రెస్ ఇష్టమొచ్చిన హామీలు గుప్పించింది. కేసీఆర్ ఎకరానికి రూ. 10 వేలే ఇస్తున్నడు.. మేం పవర్లోకి వస్తే రూ.15 వేలు ఇస్తామని వాగ్దానం చేసింది. రైతుభరోసా కింద ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పిండ్రు. గద్దెనెకిన 100 రోజుల్లో తప్పకుండా అమలు చేసి చూపుతామని గ్యారెంటీ కార్డులు ఇంటింటికీ తిరిగి పంచిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిపోయింది! ఇంతవరకు రైతు భరోసా పత్తా లేదు. రూ.15 వేలు ఇయ్యలేదు సరికదా ఉన్న రూ.10 వేలను ఊడగొట్టారు. ఇప్పటికే రెండు పంట సీజన్లు అయిపోయినయి. మూడో సీజన్ కూడా వచ్చేసింది. ఈ వానకాలం పూర్తిగా ఎగ్గొట్టిండ్రు. నిన్న యాసంగి రూ.2500 కోత పెట్టిండ్రు. ఈ యాసంగి ఇస్తరో లేదో తెల్వదు! మొత్తంగా ఒకో రైతుకు ఒకో ఎకరానికి రేవంత్రెడ్డి సర్కార్ రూ.17,500 బాకీ పడ్డది. అన్నదాతల ఖాతాల్లో పడాల్సిన పైసలివి! రైతులకు హకుగా రావాల్సిన సొమ్ము ఇది. దీన్ని వదులుకోవద్దు’ అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
రైతు భరోసాపై కాంగ్రెస్ పరార్
‘ప్రతి రైతు ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి! ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది! రైతులందరికీ ఇస్తరా? లేదా? అని శాసనసభలో ప్రశ్నిస్తే సమాధానం లేదు! పైగా రాళ్లూరప్పలకు ఇచ్చి రైతుబంధు దుర్వినియోగం చేశారని అడ్డగోలుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాదించిండ్రు! సరారు వైఖరిని గమనిస్తే అర్థంలేని కొర్రీలు పెట్టి అరకొరగా అమలు చేసి రైతు భరోసా ఇచ్చేసినం అని చెప్పి చేతులు దులుపుకోవాలని కుట్ర చేస్తున్నట్లు అర్థమైతున్నది! ఈ కుట్రను రైతాంగం గుర్తించాలి!’ అని కేటీఆర్ సూచించారు.
రైతుబంధుపై దుష్ప్రచారం
‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్రెడ్డి రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని మయాదారి ముచ్చట్లు చెప్పిండు. ఆ మనిషే ఇప్పుడు రెండో పంటకు ఇచ్చిన రైతుబంధుపై తప్పుడు ప్రచారం చేసి కర్షకులను కించ పరిచేలా మాట్లాడుతున్నడు. ఖజానాలో సొమ్మంతా రైతులే కొల్లగొట్టినట్టు ప్రచారం చేయడం సమంజసమా? అన్నంపెట్టే రైతుపై ఆంక్షలు పెట్టడం, అనుమానించడం న్యాయమా? బక రైతుకే ఎందుకు ఇన్ని షరతులు? అన్నంపెట్టే వాళ్లంటే అంత అలుసా? ఎన్నికల ముందు అందరికీ అన్నీ అని చెప్పి ఇప్పుడు కొందరికే అని మాట మార్చడం మోసం కాదా? నిజానికి రైతుబంధు లబ్ధిదారుల్లో 80 శాతం దళిత గిరిజన బహుజన రైతులే ఉన్నరు. పదెకరాలు పైబడి ఉన్న రైతులు 1.3 శాతం మందే ఉన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ లెకలను పకాగా తేల్చింది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి రైతుబంధు మీద తప్పుడు ప్రచారం అందుకున్నరు’ అని కేటీఆర్ వివరించారు.
రైతుకు ఎంతిచ్చినా తక్కువే!
‘పంట పెట్టుబడి రైతు హకు. అది భిక్ష కాదు. రైతుకు ఏమిచ్చినా.. ఎంతిచ్చినా తకు వే. రాష్ట్రంలో 47 శాతం మందికి ఉపాధినిచ్చే పెద్ద పరిశ్రమ వ్యవసాయం. రైతులు, రైతు కూలీల బతుకుదెరువు బాగుండాలంటే వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాల్సిందే కదా! రైతన్న కు ఇచ్చే సాయాన్ని దానధర్మంగా చూడొద్దు. భారంగా కాదు, బాధ్యతగా చూడాలి. రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని బహిరంగ లేఖ రాశారు. రైతుతోపాటు కౌలు రైతుకు కూడా ఎకరానికి రూ.15 వేలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. వారంతా ఎదురు చూస్తున్నరు. రైతు భరోసా కౌలు రైతులకు వస్తుందా? అని అడిగితే సరారు నుంచి సమాధానం లేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను నిలదీయండి
‘చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సరారు ఎత్తులను, నకజిత్తులను తిప్పికొట్టాలి. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులకు గల్లా పట్టి నిలదీయాలి. నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేమిటి ? ఇప్పుడు చేస్తున్న మాయలేమిటి? అని మంత్రులను, ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలి. రైతుల ఆకాంక్ష ఏంటో.. అభిప్రాయం ఏంటో తెలిసేలా సెగ పుట్టించాలి. మౌనంగా ఉంటే దగా పడుతం. నోరు విప్పకుంటే అన్యాయమైపోతం. సాధించుకున్న పెట్టుబడి హకు గంగలో కలిసిపోతది. మీతో కలిసి మేము నడుస్తం. మీ ఆందోళనకు అండగా ఉంటం. నమ్మించి నట్టేట ముంచాలని చూస్తున్న కాంగ్రెస్ను పల్లెల్లో దంచికొడదాం’ అని రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘కొట్లాట మనకు కొత్తకాదు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. రైతుకు కేసీఆర్ సరారు ఇచ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబళిస్తుంటే చూస్తూ ఊరుకోం’ అని లేఖలో హెచ్చరించారు.
భూబంధం తెంచుతారా?
‘రైతు భరోసా విధి విధానాలను నిర్ణయిస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ వేసి కాలయాపన చేసిండ్రు. జిల్లాల్లో సదస్సులు పెట్టి అభిప్రాయ సేకరణ అంటూ ఇంకొంత కాలం సాగదీసిండ్రు. ఎన్నికల ముందు ఎవరి అభిప్రాయాలను తీసుకొని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామన్నరు? ఇప్పుడెందుకు ఈ నాటకాలు? ఎన్నికల ఏరు దాటగానే తెప్ప తగలేస్తున్నరా? ఏడాదిగా లీకులిస్తూ ఆదాయపన్ను కట్టేవాళ్లకు, పాన్కార్డు ఉన్న వాళ్లకు రైతు బంధు కట్ అని పత్రికల్లో కథనాలు రాయించిండ్రు. లక్షలాది మంది ఉద్యోగులకు భూమితో బంధం తెంపేస్తరా? బ్యాంకులోన్లు సులభంగా రావడం కోసం ఐటీ చెల్లించి పాన్కార్డు తీసుకున్న వాళ్లందరి నోట్లో మన్నుకొడతరా?’ అని కేటీఆర్ నిలదీశారు.
బడేభాయ్ బాటలో చోటేభాయ్
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో కుతంత్రం కూడా చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తామని చెప్తున్నది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా పెట్టుబడి పైసలు రావు. 70 లక్షలకు పైగా రైతులు ఉంటే 30 లక్షల మందికి కూడా పీఎం కిసాన్ అందుతలేదు. ఏటా లబ్ధిదారుల సంఖ్య పడిపోతున్నది. పీఎం కిసాన్ గైడ్ లైన్స్ పెద్ద దగా.. కాంగ్రెస్ దగాకోరులు ఢిల్లీలో పీఎం కిసాన్ మార్గదర్శకాలు వద్దంటున్నరు. గల్లీలో అవే ముద్దంటున్నరు. బడేభాయ్ బాటలోనే చోటేభాయ్ నడుస్తున్నడు. రైతు భరోసా విషయంలో కూడా ఆ తోవలోనే పోతే 40 లక్షల మంది పైగా అన్నదాతలకు మొండిచెయ్యే! రైతుబంధు మీద కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం అంతా రైతు భరోసాకు కోతలు పెట్టే దురుద్దేశంతోనే. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, క్రషర్లుకు రూ. 22 వేల కోట్లు ఇచ్చారని దుష్టబుద్ధితో దుర్మార్గ ప్రచారం చేస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నది. వాస్తవం ఏమిటంటే వానకాలంలో పోల్చితే యాసంగిలో సాగు తగ్గుతుంది. పత్తి, పసుపు, చెరుకు వంటి పంటలు రెండు సీజన్లలో వేయడం సాధ్యంకాదు. కేసీఆర్ ప్రభుత్వం నాడు యాసంగిలో కూడా వానకాలం లెక ప్రకారమే రైతుబంధు జమ చేసింది. యాసంగిలో వేసిన రైతు బంధు పైసలను కాంగ్రెస్ గజదొంగలు దుర్వినియోగం లెకల్లో వేసి అన్నదాతలను దొంగలుగా చేసి చూపుతున్నరు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
శాసనసభలో రైతు భరోసాపై సీఎం రేవంత్రెడ్డి ఎటూ తేల్చకుండా సంబంధంలేని అంశాలను తెరపైకి తెచ్చి చర్చను అతితెలివితో పకదారి పట్టించాడు. బాగా అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మికులను ప్రదర్శించాడు! రైతు భరోసా పథకంపై ఆంక్షలు, అనుమానాలు.. వేటికీ సమాధానం చెప్పకుండా దాట వేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుబంధు పథకంపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేశారు. అన్నంటపెట్టే రైతును దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారు!
– రైతులకు లేఖలో కేటీఆర్