జయశంకర్ భూపాలపల్లి : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల(Double bedroom houses) లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక చేయడం కోసం డ్రా తీశారు. ఎంపిక చేసి హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు మళ్లీ కసరత్తు ప్రారంభిస్తున్నడంతో డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు.
వచ్చే నెల 12లోగా మళ్లీ లబ్ధిదారుల ఎంపిక చేస్తామని కలెక్టర్ ప్రకటించడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త జాబితాలో మాకు పేరు రాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మరోవైపు భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్పీలు వేతనాలు రావడం లేదని ముకుమ్మడిగా కలెక్టరేట్కు వచ్చి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.