కొల్లాపూర్, జూన్ 26 : ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ‘సర్’, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై సర్పంచ్ వరలక్ష్మి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
18 ఏండ్లు నిండిన యువత విధిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హులు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు.