ఢిల్లీ: భారత సెపక్తక్రా జట్టు ప్రతిష్టాత్మక వరల్డ్ చాంపియన్షిప్స్ (కింగ్స్ కప్)లో కాంస్యం సాధించింది. బ్యాంకాక్లో జరిగిన 39వ ఎడిషన్లో టోర్నీ క్వాడ్రంట్ ఈవెంట్లో భాగంగా హోరాహోరీగా సాగిన సెమీస్లో భారత్.. 1-2 (15-9, 9-15, 9-15) తేడాతో థాయ్లాండ్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. త్వరలో జరుగబోయే ఆసియా క్రీడల్లో ఈ గేమ్ కూడా ఉన్నందున భారత్కు ఈ విజయం ఉత్సాహాన్నిచ్చేదే.
ఈ టోర్నీ గ్రూప్ దశలో భారత్.. శ్రీలంక, వియత్నాం, పాకిస్థాన్, ఇరాక్ను ఓడించి సెమీస్కు చేరుకుంది. వాలీబాల్ను పోలి ఉండే ఈ ఆటలో సాధారణంగా ముగ్గురు ప్లేయర్లు ఆడతారు. చేతులను ఉపయోగించకుండా తల, చాతి, కాళ్లతో బంతిని ఆడాల్సి ఉంటుంది. కానీ, క్వాడ్రంట్ విభాగంలో నలుగురు ఆటగాళ్లు పోటీ పడతారు.