హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రజకుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నట్టు రజక సంఘాల సమితి ప్రధాన సలహాదారు కొండూరు సత్యనారాయణ కొనియాడారు. గురుకులాలు, వైద్యశాలలు, పోలీస్ శిక్షణ కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనిని రజకులకే అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిందని తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గురువారం ఆ జీవో కాపీని రజక సంఘాల నేతలకు అందజేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నదని తెలిపారు.