హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో(Local bodies) 42 శాతం రిజర్వేషన్లు(Reservations) అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ (BC Janasabha)రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ జనసభ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అడ్డుకోబోయిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు.
దీనితో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లా డుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి విజయభేరీ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉండాలని అన్నారు. అయితే లోక్సభ ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన ఆరోపించారు.
కులగణన, సామాజిక న్యాయం పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిన కాంగ్రెస్.. మరోసారి బీసీలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు. కులగణన చెయ్యకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వ కుండా ఆగమేఘాల మీద స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే.. జూన్ 8న ఇందిరాపార్కు దగ్గర వేలాది మందితో మహా ధర్నా కార్యక్రమం చేస్తామని, అప్పుడు కూడా మొండిగా వెళ్ళితే.. జూన్ 15న సెక్రటేరియట్ను ముట్టడి చేయనున్నట్టు రాజారాం యాదవ్ ప్రకటించారు.